News Ticker

Menu

ఆగష్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

 

ఆగష్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం: మంత్రి ఆదిమూలపు

సాక్షి, అమరావతి: ఆ ఆంధ్రప్రదేశ్‌లో ఆగష్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఈనెల 12 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నాడు నేడు, జగనన్న విద్యా కానుకపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. రెండేళ్లలో ఫౌండేషన్ స్కూళ్లకు అదనపు గదులు నిర్మిస్తామని తెలిపారు. 30 శాతం పదో తరగతి, 70 శాతం ఇంటర్ ఫస్టియర్ మార్కులు ప్రాతిపదికగా.. ఇంటర్ విద్యార్థులకు మార్కుల కేటాయిస్తామని అన్నారు. ఈ నెలాఖరులోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేస్తామన్నారు. అయితే నాడు-నేడు కింద పనుల కోసం రూ.16 వేల కోట్లతో బడ్జెట్ సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు. ఆగష్టులోపు విద్యాసంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి కావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నాడు-నేడు కింద పనుల కోసం రూ.16 వేల కోట్లతో బడ్జెట్ సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు. 

అమరావతి: ఆగస్ట్ 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని సీఎం జగన్ తెలిపారు. ఈలోపు టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా టీచర్లు ఉండాలన్నారు. ఇవాళ విద్యారంగంలో నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. నూతన విద్యావిధానం ప్రతిపాదనలను ఈవారంలో ఖరారు చేయాలన్నారు. నాడు-నేడు పనులు యాథావిధిగా కొనసాగించాలని చెప్పారు. 

ఉద్యోగులకు వాయిదాల పద్ధతిన (EMI) ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఆగష్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM