షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు
పది, ఇంటర్ పరీక్షలు
Andhra Pradesh: షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు- మంత్రి సురేష్

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యంతో పాటు విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి అన్నారు. ఈ నెలాఖరు వరకు విద్యార్థులకు సెలవులు ఇచ్చామన్న మంత్రి.. వారి భవిష్యత్తు కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పలు రాష్ట్రాలు ఇప్పుటికే పరీక్షలు నిర్వహించాయన్నారు. జూన్ 1 నుంచి టీచర్లు విధులకు హాజరుకావాల్సిందిగా ఆదేశించామని తెలిపారు.
★ జూన్ 7 నుంచి టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
★ శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు.
★ ఆరోగ్యంతో పాటు విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి అన్నారు.
★ ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్ అవ్వాలని సూచించారు.
★ రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సురేష్ తెలిపారు.
★ ఈ నెలాఖరు వరకు విద్యార్థులకు సెలవులు.
★ జూన్ 1 నుంచి స్కూల్స్ కి టీచర్లు రావాలి.
★ త్వరలో షెడ్యూల్ పై సమీక్షిస్తాం' అని విద్యాశాఖ మంత్రి అన్నారు.
No Comment to " షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు "