News Ticker

Menu

కేంద్రం నుంచి పీపీఎఫ్ స్కీమ్...రూ.5,000తో రూ.17 లక్షలు

 కేంద్రం నుంచి పీపీఎఫ్ స్కీమ్...రూ.5,000తో రూ.17 లక్షలు

డబ్బు సంపాదించాలని ఆలోచిస్తున్నారా? రిస్క్ లేకుండా అదిరిపోయే రాబడి పొందాలని యోచిస్తు్న్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వం అందించే స్కీమ్ అందుబాటులో ఉంది. ఈ పథకంలో చేరడం వల్ల మెచ్యూరిటీ సమయంలో కళ్లుచెదిరే లాభం పొందొచ్చు. ఆ స్కీమ్ పేరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF). వీలైనంత త్వరగా ఈ స్కీమ్‌లో డబ్బులు పెట్టడం మంచిది. బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్స్‌లో పీపీఎఫ్ ఒకటి. ఇది దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్ సాధనం. ఇందులో డబ్బులు పెట్టడం వల్ల కాంపౌండింగ్ ప్రయోజనం పొందొచ్చు. ఈ స్కీమ్‌లో ఎవరైనా చేరొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్‌ స్కీమ్‌లో కనీసం రూ.500 డిపాజిట్ చేస్తే సరిపోతుంది. గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే నెలకు రూ.12,500 వరకు డిపాజిట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ స్కీమ్‌లో డబ్బులు పెట్టిన వారు ఆదాయపు పన్ను శాఖ అందించే ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. మీరు పీపీఎఫ్ అకౌంట్‌లో నెలకు రూ.5,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వెలితే ఎంత రాబడి పొందొచ్చొ తెలుసుకుందాం. పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. దీన్ని కావాలనుకుంటే ఐదేళ్ల చొప్పున పెంచుకుంటూ వెళ్లొచ్చు. ఇలా మీరు నెలకు రూ.5,000 ఇన్వెస్ట్ చేస్తూ వెలితే మెచ్యూరిటీ సమయంలో మీ చేతికి ఏకంగా రూ.17 లక్షలు వస్తాయి. ప్రస్తుతం పీపీఎఫ్ ఖాతాపై 7.1 శాతం వడ్డీ లభిస్తోంది.

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " కేంద్రం నుంచి పీపీఎఫ్ స్కీమ్...రూ.5,000తో రూ.17 లక్షలు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM