టెక్నాలజీ తో అకడమిక్ ప్లాన్
టెక్నాలజీ తో అకడమిక్ ప్లాన్
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ ,
అకడమిక్ ప్లాన్ , నాడు- నేడు పనుల పూర్తి తదితర అంశాల్లో విద్యాశాఖ కీలక
నిర్ణయం తీసుకుంది . పాఠశాలల నిర్వహణలో సాంకేతికతను జోడిస్తూ పలు మార్పులు ,
చేర్పులకు శ్రీకారం చుడుతోంది . రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెద్ద
ఎత్తున పెరుగుతుండటంతో విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని
పరిస్థితులు నెలకొన్నా యి . ఈ నేపథ్యంలో విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే వరకు
విద్యార్ధులకు ఆన్లైన్ ద్వారా బ్రిడ్జి కోర్సులు కొనసాగించాలని
నిర్ణయించింది . ఈ మేరకు పలు అంశాలతో సోమవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్
వాడ్రేవు చినవీరభద్రుడు ఉత్తర్వులు విడుదల చేశారు . క రోనా కేసులు
పెరుగుతున్న నేపథ్యంలో త్వరతిగతిన యూడైస్ డేటానమోదు ప్రక్రియ పూర్తి
చేయాలని , ఈ నెల పదో తేదీలోగా పూర్తి కావాలని సూచించారు . అలాగే కరోనా
కేసులు అన్ని చోట్ల బయట పడుతుండటంతో పనిదినాలను కుదిస్తూ విద్యాశాఖ నిర్ణయం
తీసుకుంది . ఈ నెల 18 వ తేదీ నుంచి ప్రాథమిక స్థాయిలో ఒక రోజు ,
ప్రాథమికోన్నత , ఉన్నత స్థాయి పాఠశాలల్లో రెండు రోజులు ఉపాధ్యాయులు హాజరు
కావాలని ఆదేశించింది .
హైటెక్ , లో టెక్ , నో టెక్ వ్యూహాలతో బోధన
విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి మరింత
సమయం పట్టే అవకాశాలు ఉండటంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో బోధన కోసం మూడు
వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు . హైటెక్ , లోటెక్ , నోటెక్ పేరుతో బ్రిడ్జి
కోర్సుల నిర్వహణ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు .
పాఠశాలలు పూర్తి స్థాయిలో తెరుచునే వరకు
ప్రతి వారం ఈ బ్రిడ్జి కోర్సు ద్వారా ఇచ్చిన మెటీరి యల్ ను విద్యార్ధులు
పక్కాగా ఫాలో అవుతు న్నారో లేదో ఎప్పటికప్పుడు ఉపాధ్యా యులు పరిశీలన చేసి
రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది . స్మార్ట్ ఫోన్ , ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న
వారికి ఆన్ లైన్ ద్వారా పాఠ్యాంశాలు బోధిం చేలా హైటెక్ బోధన ఉంటుంది . ఆ
అవకాశం లేని వాళ్లకు దూర దర్శన్ , ఎస్ఎం రేడియో తదితరాల ద్వారా బ్రిడ్జి
కోర్సు పాఠ్యాంశాలు బోధించ డాన్నిలో టెక్ గా వ్యవహరించను న్నారు . ఎటువంటి
సాంకేతిక పరికరాలు అందు బాటులో లేని వారికోసం నోటెక్ పేరిట ప్రత్యేక
కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నారు . కంప్యూటర్ , నెట్ , ఆండ్రాయిడ్
స్మార్ట్ ఫోన్లు ఉన్న విద్యార్థులతో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి
ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సి ఉంటుంది . ప్రతి ఉపాధ్యాయుడు 10 నుంచి 20
మంది విద్యార్థులతో నిరంతరం టచ్ లో ఉండి , వారికి తగిన సూచనలు చేయాల్సి
ఉంటుంది . ఈ మేరకు జిల్లాల విద్యాశాఖాధి కారులు , రీజినల్ జాయింట్
డైరెక్టర్లు పాఠశాలల నిర్వహణపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో
కమిషనర్ పేర్కొన్నారు .
No Comment to " టెక్నాలజీ తో అకడమిక్ ప్లాన్ "