News Ticker

Menu

ఉపాధ్యాయుల బదిలీల్లో మార్పులు ఆరు అంశాలపై పాయింట్ల కేటాయింపు ప్రభుత్వానికి చేరిన దస్త్రం

ఉపాధ్యాయుల బదిలీల్లో మార్పులు ఆరు అంశాలపై పాయింట్ల కేటాయింపు ప్రభుత్వానికి చేరిన దస్త్రం

ఉపాధ్యాయుల బదిలీల్లో మార్పులు
ఆరు అంశాలపై పాయింట్ల కేటాయింపు
ప్రభుత్వానికి చేరిన దస్త్రం


రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన దస్త్రం ప్రభుత్వానికి చేరింది. దీనిపై సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ దఫా బదిలీల నిబంధనల్లో మార్పు చేస్తున్నారు. గతంలో నిర్వహించిన బదిలీల్లో పనితీరు ఆధారంగా కొన్ని పాయింట్లు కేటాయించగా.. ఈసారి వాటిని తొలగించారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలను నిర్వహించాలని పాఠశాల విద్య కమిషనరేట్‌ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం బదిలీలపై నిషేధం ఉన్నందున సంబంధిత దస్త్రానికి ముఖ్యమంత్రి ఆమోదం లభించాలి.

నిబంధనలు ఇలా..
ప్రస్తుత బదిలీల్లో ఆరు నిబంధనలను తీసుకురానున్నారు. వాటికి పాయింట్లు కేటాయించనున్నారు. అవి..
* గ్రామీణం, మారుమూల, పట్టణాలకు ప్రాంతాల వారీగా పాయింట్లు (హెచ్‌ఆర్‌ఏ)
* సర్వీసు

* స్పౌజ్‌ బీ అవివాహితులు
* సంఘాల నేతలు

* హేతుబద్ధీకరణ
జనవరిలోనా.. ఏప్రిల్‌లోనా?
ఈ ఏడాది వేసవిలో జనగణన ప్రారంభమవుతున్నందున ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టడం కష్టమని, ముందుగానే నిర్వహించాలని ఇటీవల మంత్రి సురేష్‌కు ఉపాధ్యాయ సంఘాలు విన్నవించాయి. దీనిపై స్పందించిన ఆయన జనవరిలో నిర్వహిస్తామని ప్రకటించారు. జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే బదిలీలకు ఆటంకం ఏర్పడుతుంది.జనవరిలో నిర్వహించకపోతే ఏప్రిల్‌నుంచి జనగణన మొదలవుతుందని, ఆ సమయంలోకుదరదని ఉపాధ్యాయులుపేర్కొంటున్నారు.

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఉపాధ్యాయుల బదిలీల్లో మార్పులు ఆరు అంశాలపై పాయింట్ల కేటాయింపు ప్రభుత్వానికి చేరిన దస్త్రం "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM