మధ్యాహ్న భోజన పథకం ధరల పెంపు
మధ్యాహ్న భోజన పథకం ధరల పెంపు
ఈనాడు , అమరావతి : పాఠశాల మధ్యాహ్న భోజన పథకం వంట ధరలను 10 . 99 శాతం
పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . ఏప్రిల్ నుంచి
అమల్లోకి వచ్చే ఈ ధరల్లో కేంద్రం 60శాతం , రాష్ట్రం 40శాతం భరించాల్సి
ఉంటుంది . ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రూ . 4 . 97 ,
ప్రాథమికోన్నత బడుల్లో రూ . 7 . 45 చొప్పున చెల్లించనున్నారు .
No Comment to " మధ్యాహ్న భోజన పథకం ధరల పెంపు "