11,114 గ్రామ సచివాలయాలు.. 91,652 ఉద్యోగాలు
11,114 గ్రామ సచివాలయాలు.. 91,652 ఉద్యోగాలు
* ప్రతిపాదనలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో 11,114 గ్రామ
సచివాలయాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వీటిలో
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే ఉన్న ఖాళీలతోపాటు కొత్తగా 91,652 ఉద్యోగుల
నియామకానికి అనుమతించింది. ఈ మేరకు జులై 19న పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రతి సచివాలయంలో పది
మంది శాశ్వత ఉద్యోగులను నియమిస్తున్నారు. పంచాయతీ కార్యాలయాన్ని ఇక
గ్రామసచివాలయంగా పరిగణిస్తారు. రెండు వేల జనాభాకు మించి నాలుగువేల కంటే
తక్కువ ఉన్న గ్రామపంచాయతీని ఒక సచివాలయంగా గుర్తిస్తారు. ఇంతకుమించి జనాభా
ఉన్న గ్రామపంచాయతీల్లో రెండు నుంచి మూడు సచివాలయాలను ఏర్పాటుచేస్తారు.
రెండువేల జనాభాకంటే తక్కువ ఉంటే ఒకటి, రెండు కలిపి ఒక సచివాలయంగా
ఏర్పాటుచేస్తారు. ఉద్యోగుల నియామక ప్రక్రియపై నిర్ణయాలు తీసుకునేందుకు
ప్రత్యేక కమిటీని ప్రభుత్వం నియమించింది. కమిటీ ఛైర్మన్గా పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వ్యవహరిస్తారు.
ఇదీ షెడ్యూలు...
* జులై 23 నుంచి సెప్టెంబరు 14 మధ్య ఉద్యోగుల నియామకం చేపడతారు.
* సెప్టెంబరు 16 నుంచి 28 మధ్య ఎంపికైన ఉద్యోగులకు శిక్షణ ఇస్తారు.
* సెప్టెంబరు 20నాటికి తగిన సౌకర్యాలతో సచివాలయాలను సిద్ధం చేస్తారు.
* ఉద్యోగులకు సెప్టెంబరు 30న సచివాలయాలను కేటాయిస్తారు.
* అక్టోబరు 2 నుంచి సచివాలయాలు అమల్లోకి వస్తాయి.
ఇదీ షెడ్యూలు...
* జులై 23 నుంచి సెప్టెంబరు 14 మధ్య ఉద్యోగుల నియామకం చేపడతారు.
* సెప్టెంబరు 16 నుంచి 28 మధ్య ఎంపికైన ఉద్యోగులకు శిక్షణ ఇస్తారు.
* సెప్టెంబరు 20నాటికి తగిన సౌకర్యాలతో సచివాలయాలను సిద్ధం చేస్తారు.
* ఉద్యోగులకు సెప్టెంబరు 30న సచివాలయాలను కేటాయిస్తారు.
* అక్టోబరు 2 నుంచి సచివాలయాలు అమల్లోకి వస్తాయి.
No Comment to " 11,114 గ్రామ సచివాలయాలు.. 91,652 ఉద్యోగాలు "